నల్లధనం హామీ ఏమైంది?


రామ్‌టెక్ (మహారాష్ట్ర): అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనాన్ని తీసుకొస్తామంటూ ఇచ్చిన హామీని నరేంద్ర మోడీ సర్కారు ఇప్పటివరకూ నెరవేర్చకలేకపోయిందని రాహుల్ గాంధీ విమర్శించారు. మహారాష్ట్ర అభివద్ధిలో వెనకబడిందంటూ ప్రధాని వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ తోసిపుచ్చారు. అభివృద్ధి పథంలో గుజరాత్‌కన్నా మహారాష్ట్ర ఎంతో ముందంజలో ఉందని చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాగ్‌పూర్ జిల్లాలోని రామ్‌టెక్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్నారు.


 


గత 60 ఏళ్లలో తమ పార్టీ దేశాన్ని అభివద్ధి చేయలేదంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. ఒకవేళ అదే నిజమైతే మహారాష్ర్ట ప్రస్తుతం అభివద్ధిలో ముందడుగు ఎలా వేయగలిగిందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే రామ్‌టెక్ పట్టణాన్ని పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top