నేను చావుకు సిద్ధం: ఐసిస్ సిద్ధార్థ
లండన్: ఐసిస్ ఉగ్రవాద సంస్థ కోసం తన ప్రాణాలు కోల్పోవడానికీ సిద్ధంగా ఉన్నానని భారత సంతతి ఉగ్రవాది సిద్ధార్థ ధర్ తనతో చెప్పినట్లు ఆయన సోదరి కోనిక తెలిపారు. అక్టోబర్లో సిద్ధార్థ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, ‘నేను చావుకు సిద్ధంగా ఉన్నాను’ అని చెప్పాడన్నారు.
సిద్ధార్థ ఐసిస్లో చేరిన తొలినాళ్లలో ఇంటికి తిరిగి రావాలని అడి గినా తిరిగివస్తే తనని అరెస్టు చేస్తారని సిద్ధార్థ భయపడ్డాడన్నారు. సిద్ధార్థ సిరియా వెళ్లే ముందు బ్రిటన్ నిఘా సంస్థ నియమించుకోడానికి యత్నించినట్లు తెలుస్తోంది.
సంబంధిత వార్తలు