వరకట్న వేధింపులకు వివాహిత బలి

Woman commits suicide over alleged dowry harassment - Sakshi

సాక్షి, కమ్మర్‌పల్లి(నిజామాబాద్‌ జిల్లా): కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌లో విషాదం చోటుచేసుకుంది. వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైంది. గ్రామానికి చెందిన ముఖేష్‌(29) అనే వ్యక్తితో ప్రవీణ(24)కు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి వరకట్నం కోసం వేధించటంతో మనస్తాపానికి గురై ఒంటి పై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top