పోలీస్ కానిస్టేబుల్ మృతిపై సీపీ దిగ్భ్రాంతి

VC Sajjanar Mourns On Police Constable Death - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రోడ్డుప్రమాదంలో మృతిచెందిన మైలార్‌ దేవుపల్లి పోలీస్‌ కానిస్టేబుల్‌ తులసీరాం మృతిపై సైబరాబాద్‌ సీపీ వీసి సజ్జనార్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి పోలీస్‌ శాఖపరంగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. 2018 బ్యాచ్‌కి చెందిన తులసీరాం(8842)ది రంగారెడ్డి జిల్లాలోని ధరూర్‌. ఓ కేసు దర్యాప్తులో భాగంగా పీసీ తులసీరాం బీహార్‌లోని దర్బంగా నుంచి హైదరాబాద్‌ తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. మధ్యప్రదేశ్‌లోని డిండోరి జిల్లా సమన్‌ పూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం కారణంగా అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసు అధికారులు తులసీరాం భౌతికకాయాన్ని ఈ రోజు హైదరాబాద్‌ తరలించనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top