తెలుగు రాష్ట్రాల్లో కిషన్‌రెడ్డి పర్యటన

Union Home Minister Kisan Reddy is coming to Hyderabad today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నేడు హైదరాబాద్‌కు వస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి నాలుగు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా హైదరాబాద్‌కు వస్తున్న కిషన్‌రెడ్డికి భారీఎత్తున స్వాగతం పలికేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనే కిషన్‌రెడ్డి 8న ఆయన స్వగ్రామమైన తిమ్మాపూర్‌లో తన మాతృమూర్తి ఆండాలమ్మకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు.

అదేరోజు రాత్రి తిరుమలకు వెళ్లనున్నారు. 9వ తేదీన ప్రధాని మోదీతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం అక్కడే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 10వ తేదీన అంబర్‌పేట, సనత్‌నగర్‌లో పాదయాత్రలో పాల్గొంటారు. అదేరోజు బీజేపీ పార్లమెంటరీ కోర్‌ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం జీహెచ్‌ఎంసీ, వాటర్‌ బోర్డు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. 11వ తేదీన ఉదయం తిరిగి ఢిల్లీకి వెళతారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top