‘మళ్లీ మీరే కొనసాగాలి’
సాక్షి, సిటీబ్యూరో: టీఆర్వీకేఎస్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు పదవికి నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత రాజీనామా చేయడం, దాన్ని తిరస్కరిస్తూ యూనియన్ నాయకులు తీర్మాణం చేయడం జరిగింది. ఈ మేరకు బుధవారం టీఆర్వీకేఎస్ యూనియన్ నాయకులు కేవీ జాన్సన్, కోడూరి ప్రకాష్లు ఆమెను కలిసి తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే బాల్క సుమన్, వైస్ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఎస్పీడీసీఎల్ కంపెనీ కార్యదర్శి కరెంట్ రావు, టీఎస్ ట్రాన్స్కో కంపెనీ కార్యదర్శి రాములు, ఎన్పీడీసీఎల్ కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్బర్ పాల్గొన్నారు.