టుడే న్యూస్ అప్ డేట్స్
- ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న మంత్రులు హరీష్, తుమ్మల
పాలెం వాగు ప్రాజెక్ట్ను ప్రారంభించనున్న హరీష్ రావు, తుమ్మల
పాలేరు, కిన్నెరసాని లెఫ్ట్ కెనాల్ నుంచి నీటిని విడుదల చేయనున్న మంత్రులు
- వైఎస్ఆర్ జిల్లా రాజుపాలెంలో భారీ వర్షం
ప్రొద్దుటూరు-ఆళ్లగడ్డ రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు
- శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా పెరిగిన వరద
ఇన్ఫ్లో 95 వేల 821 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 14 వేల 825 క్యూసెక్కులు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
అన్ని కంపార్ట్మెంట్లు నిండి కిలో మీటర్ మేర క్యూలైన్
శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
- తిరుమల : ఇవాళ శ్రీవారి ఆలయంలో బాగ్ సవారి
మాడవీధుల్లో అప్రదక్షణంగా ఊరేగనున్న శ్రీవారు
ఇవాళ్టి నుంచి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరణ
- శ్రీకాకుళం : అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకని సూర్యకిరణాలు
రెండో రోజు కూడా తాకని సూర్యకిరణాలు, నిరాశతో వెనుదిరిగిన భక్తులు
- షిర్డీలో ఎయిర్ పోర్టును ప్రారంభించిన రాష్ట్రపతి కోవింద్
షిర్డీ-ముంబై మధ్య తొలి సర్వీసు
ఇవాళ్టి నుంచి హైదరాబాద్-షిర్డీ మధ్య విమాన సర్వీసులు
- న్యూఢిల్లీ : ఎల్పీజీ సిలిండర్పై రూ.1.50 పైసలు పెంపు
2018 మార్చికల్లా సబ్సిడీ ఎత్తివేతే లక్ష్యంగా చర్యలు
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో భారత్
నాగ్పూర్ వన్డేలో 7 వికెట్ల తేడాతో ఆసీస్పై భారత్ విజయం
ఐదు వన్డేల సిరీస్ 4-1 తేడాతో భారత్ కైవసం