టీఎస్ఆర్టీసీలో కొత్తగా టీజేఎంయూ
హైదరాబాద్: టీఎస్ఆర్టీసీలో కొత్త కార్మిక సంఘం తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్(టీజేఎంయూ) ఆవిర్భవించింది. వీఎస్టీ సమీపంలో ఏర్పాటుచేసిన ఆ యూనియన్ కేంద్ర నూతన కార్యాలయాన్ని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం శనివారం ప్రారం భించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ, టీఎస్ఆర్టీసీలో కొత్త యూనియన్ ఆవిర్భా వం నూతన శకానికి నాంది పలుకుతుందన్నారు. ఆర్టీసీ పరిరక్షణకు, కార్మికుల హక్కుల సాధనకు ఆర్టీసీ యూనియన్లు, అసోసియేషన్లు జేఏసీగా ఏర్పాటు కావాల్సిన ఆవశ్యకత ఉందని కోదండరాం తెలిపారు.
కార్మికుల పక్షాన పోరా డటానికి టీజేఎంయూను ఏర్పాటుచేసినట్లు యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.హన్మంతు, అధ్యక్షుడు పి.సుధాకర్ తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ వైస్ ప్రెసి డెంట్ డీవీకే రావు, సహాయ కార్యదర్శి స్వాములయ్య, సుదర్శన్, ఎంఆర్కే రెడ్డి, జీవీకే రెడ్డి, ఆర్ఎన్ రావు, గోవర్ధన్, పీఎస్ఎస్ రావు, అశ్విన్ పాల్గొన్నారు.