టీజీసీసీ ద్వారా మూడుచోట్ల శుద్ధికేంద్రాలు
హైదరాబాద్: తెలంగాణ గిరిజన సహకార సంస్థ (టీజీసీసీ) ద్వారా వరంగల్ జిల్లా ములుగులో జిగురు, తేనే శుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో షాంపూలు, సబ్బులు తయారీ కేంద్రం, నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో చింతపండు శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
బుధవారం సచివాలయంలో గిరిజనసంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ చాంబర్లో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి జి.డి.అరుణ, కమిషనర్ మహేశ్దత్ ఎక్కా తదితరులతో సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో ప్రైవేటు టీచర్లను హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు ఆయా సబ్జెక్టులు బోధించేలా చర్య లు తీసుకోనున్నారు. ఇకపై గిరిజన హాస్టళ్లకు టీజీసీసీ ద్వారానే సరుకులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.