విద్యార్థిని ఆత్మహత్య

tenth class Student Commits Suicide - Sakshi

వాజేడు(భద్రాచలం): పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వాజేడు మండల పరిధిలోని ఘణపురం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఘణపురం గ్రామానికి చెందిన యాలం రేణుక(14) వాజేడు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మంగళవారం రాత్రి ఇంట్లో తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని అత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై వాజేడు ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్‌ను సంప్రదించగా.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top