దుబాయ్లో తెలంగాణ యువకుడు ఆత్మహత్య
దుబాయ్: తెలంగాణకు చెందిన యువకుడు దుబాయ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం యశ్వంతరావు పేటకు చెందిన పంబాల శ్రీనివాస్ (24) అనే యువకుడు బుధవారం ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. ప్రయివేటు (ఆజాద్) వీసాపై ఉన్న శ్రీనివాస్ బర్ దుబాయి అనే ప్రాంతంలో ఇళ్లల్లో పార్ట్ టైం హౌజ్ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ ఆత్మహత్య చేసుకోవడంతో యశ్వంతరావు పేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. అవివాహితుడైన శ్రీనివాస్ కు తండ్రి భూమయ్య, తల్లి బక్కవ్వ, అక్క, తమ్ముడు ఉన్నారు.