'బాబు వచ్చాడు.. తెలంగాణలోనూ వర్షాల్లేవు'


చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం వల్లే తెలంగాణలో కూడా వర్షాలు పడట్లేదని ప్రజలు అనుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రులు నాయిని నరసింహారెడ్డి, జగదీష్రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు కలిసి తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నారని వాళ్లు ఆరోపించారు.



ఇక తెలంగాణలో కరెంట్ కోతలకు కాంగ్రెస్సే కారణమని నాయిని నరసింహారెడ్డి, జగదీష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే నైతిక హక్కు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లేదని, టీ కాంగ్రెస్ నేతలంతా బఫూన్లలా వ్యవహరిస్తున్నారని వాళ్లు మండిపడ్డారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top