రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా రజత్‌కుమార్‌

Telangana CEO Rajat Kumar - Sakshi

నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా రజత్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఢిల్లీలోని నిర్వాచన్‌ సదన్‌లో ఎన్నికల కమిషనర్ల పానెల్‌ సమావేశమై తెలంగాణకు కొత్త సీఈవోగా ఆయనను ఎంపిక చేసింది. 1991 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన రజత్‌కుమార్‌ ప్రస్తుతం అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రీ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. తెలంగాణ ఏర్పడ్డాక తొలి సీఈవోగా రజత్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఈవోగా వ్యవహరించిన భన్వర్‌లాల్‌ ఏపీ విడిపోయాక రెండు తెలుగు రాష్ట్రాలకు సీఈవోగా కొనసాగారు. భన్వర్‌లాల్‌ పదవీ విరమణ పొందాక ఏపీ సీఈవోగా సిసోడియా బాధ్యతలు చేపట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top