రేవంత్ పార్టీని వీడినా నష్టమేమీ లేదు
పరిగి: రేవంత్ రెడ్డి పార్టీని వీడినంత మాత్రా న పార్టీకి వచ్చే నష్టమేమిలేదని టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పీ చంద్రయ్య అన్నారు. శనివారం ఆయన పరిగిలో ఆ పార్టీ జిల్లా నాయకులు లా ల్కృష్ణప్రసాద్, ఉస్మాన్ అలీలతో కలిసి విలేకర్ల సమా వేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇలాంటి పరిణామాలు టీడీపీకి కొత్తేంకాదని, ఇలాంటి నాయకులు వస్తుంటారు.. పోతుంటారని పార్టీ మాత్రం స్థి రంగా ఉంటుందన్నారు. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో టీడీపీ బలంగానే ఉందన్నారు. రాబోయే రోజుల్లో గాయాలు మాన్పుకొని పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని తెలిపారు.