ఓయూ బోధనేతర సిబ్బందిని క్రమబద్ధీకరించాలి సీపీఎం కార్యదర్శి తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: ఓయూలో 18 వందల మంది బోధనేతర కాంట్రాక్టు ఉద్యోగులు 25 ఏళ్ళుగా శ్రమ దోపిడీకి గురవుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొ న్నారు. వారి ఉద్యోగాలను తక్షణమే క్రమ బద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ గురు వారం సీఎం కేసీఆర్కు లేఖ రాశారు.
కొంత మంది ఇప్పటికే రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారని, వారు జీవితం మొత్తం ఓయూ అభివృద్ధికి తమ శక్తిని ధారపోశారని వెల్లడించారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని పలుమార్లు ప్రక టించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు వారి గురించి పట్టించుకోవడం లేదని విమర్శిం చారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు నిరవధిక సమ్మెకు దిగారని అన్నారు.