సూరీడు సుర్రు!

Summer Temperatures Rises in Telugu States - Sakshi

గ్రేటర్‌లో సరాసరి 42 డిగ్రీల ఉష్ణోగ్రత

నారాయణగూడలో 42.7 డిగ్రీలు  

ప్రస్తుత వేసవిలో ఇదే అత్యధికం

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో భానుడు భగభగమంటున్నాడు. చండ ప్రచండమైన ఎండలతో బెంబేలెత్తిస్తున్నాడు. వేడి సెగలతో నగరవాసిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.  గురువారం నారాయణగూడలో 42.7 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా..  నగర వ్యాప్తంగా సరాసరిన 42 డిగ్రీలు నమోదయ్యాయి. ఈ వేసవిలో నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికం. గురువారం ఉదయం 10 గంటల నుంచే ఎండ సుర్రుమనిపించింది. మధ్యాహ్నం వేడిగాలులు హడలెత్తించాయి. వివిధ పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లినవారు వడదెబ్బ బారిన పడ్డారు. రానున్న 48 గంటల్లో నగరంలో ఎండ భగభగలు అధికంగా ఉంటాయని, వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top