రంజిత్ మోహన్కు మద్దతుగా మౌనదీక్షలు
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ నేత రంజిత్ మోహన్కు కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాలని కోరుతూ శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మౌన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 40 సంవత్సరాలుగా రంజిత్ మోహన్ బీజేపీలో పని చేస్తున్నారని తెలిపారు. బీజేపీ నాయకత్వం ఆయనకు మూడు సార్లు మాట ఇచ్చి మోసం చేసిందన్నారు. సంబంధం లేని వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం యోచిస్తోందన్నారు.
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా రంజిత్ మోహన్కు అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రంజిత్ మోహన్ పట్టభద్రుల ఎన్ రోల్ విషయంలో చొరవ చూపారని తెలిపారు. రంజిత్ మెహన్కు కాకుండా వేరే వాళ్లకు అవకాశమిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
మరిన్ని వార్తలు