రేపు నిజామాబాద్కి కేంద్ర మంత్రి రాక
ఎల్లారెడ్డి సభలో పాల్గొననున్న స్మృతి ఇరానీ
మోదీ సభతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం
పార్టీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి
సాక్షి, కామారెడ్డి : ఎల్లారెడ్డిలోని చర్చి గ్రౌండ్లో గురువారం నిర్వహించే బీజేపీ ఎన్నికల ప్రచార సభలో కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ పాల్గొననున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ సభకు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలని కోరారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మంగళవారం నిజామాబాద్లో నిర్వహించిన ప్రధాని నరేంద్రమోదీ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సభతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండిందన్నారు. మోదీ సారథ్యంలో కొనసాగుతున్న అవినీతి రహిత పాలనకు ప్రజలు ఆకర్షితులవుతున్నారన్నారు. ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
పరిపూర్ణానంద, అమిత్ షా పర్యటనలు..
వచ్చేనెల ఒకటో తేదీన స్వామి పరిపూర్ణానంద జిల్లాలో పర్యటిస్తారని బాణాల తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లంలో నిర్వహించే సభలో స్వామీజీ పాల్గొంటారన్నారు. రెండో తేదీన కామారెడ్డిలోని సీఎస్ఐ చర్చి గ్రౌండ్లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా పాల్గొంటారన్నారు. సభలను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో బీజేపీ అభివృద్ధి కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్గౌడ్, కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరమణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ మర్రి రాంరెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి మోహన్రావు, నాయకుడు కుసుమ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.