సాఫ్ట్వేర్ ఉద్యోగిని దాతృత్వం
చాంద్రాయణగుట్ట: లాక్డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న పేదల కోసం ఆ యువతి తన జీతం డబ్బుల నుంచి బియ్యం, నగదు పంచి దాతృత్వాన్ని చాటుకుంది. జంగమ్మెట్ లక్ష్మీనగర్కు చెందిన సి.దీక్ష సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. లాక్డౌన్ సందర్భంగా రాత్రింబవళ్లు పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో పాటు నిరుపేదలకు ఒక్కొకరికి ఐదు కిలోల బియ్యం, రూ.500ల చొప్పున అందజేసింది.