దర్యాప్తు తీరు ఇదేనా..?

Sailaja charan reddy fires on chandrababu naidu government - Sakshi

వైఎస్సార్‌ సీపీ ఏపీ మహిళా విభాగం 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శైలజాచరణ్‌రెడ్డి

గజ్వేల్‌: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించిన కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు అనుమానాలకు తావు కల్పిస్తోందని వైఎస్సార్‌సీపీ ఏపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శైలజాచరణ్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం గజ్వేల్‌కు వచ్చిన సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనపై ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులు సరైన విధంగా స్పందించడం లేదన్నారు. 

అత్యంత కీలకమైన ఈ కేసులో దర్యాప్తు జరపాల్సిన ఎన్నో కోణాలను అధికారులు విస్మరిస్తున్నారని ఆరోపించారు. హైకోర్టులో పిటిషన్‌ వేసిన తర్వాత హడావిడి చేస్తున్నారని తెలిపారు. ఏపీ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న జగన్‌పై హత్యా యత్నాన్ని అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. ప్రతీ అంశాన్ని సునిశితంగా పరిశీలించి దర్యాప్తు సమగ్రంగా జరపాల్సి ఉందన్నారు. ఏపీలో తమ పార్టీ అధినేత చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు భారీ స్పందన వస్తోందన్నారు. ప్రజల మద్దతుతో జగన్‌ నిరంతరం ముందుకు సాగుతారని చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top