రౌడీషీటర్ దారుణహత్య
పెద్దపెల్లి: జిల్లాలోని గోదావరిఖనికి చెందిన ఆరుకోళ్ల శ్రీనివాస్ అలియాస్ బుగ్గల శ్రీను(40)ను గుర్తుతెలియని వ్యక్తులు ఈ రోజు ఉదయం దారుణంగా హతమార్చారు. పట్టణంలోని ఉదయ్నగర్లో నివసిస్తున్న శ్రీను ప్రస్తుతం మన తెలంగాణ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. ఈ రోజు ఉదయం 9గంటల సమయంలో ఆటోలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు మాట్లాడాలని శ్రీను ఇంట్లోకి వెళ్లారు. వారిని ఇంట్లోకి ఆహ్వానించిన శ్రీనుపై తమ వెంట తెచ్చుకున్న కత్తులతో ఒక్కసారిగా దాడి చేశారు.
విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దాడి జరిగిన సమయంలో ఇంట్లో అతని భార్య, పిల్లలు ఉన్నారు. అడ్డుకోబోయిన బార్యపై కూడా దుండగులు దాడి చేయడంతో ఆమే చేతికి గాయాలయ్యాయి. గోదావరిఖని ఏసీపీ అపూర్వరావు, వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. 2010లో జరిగిన కానిస్టేబుల్ ఎర్రగోల్ల రమేష్ హత్య కేసులో శ్రీను ప్రధాన నిందితుడు. అతనిపై గోదావరిఖని పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. కానిస్టేబుల్ హత్యకేసుతో పాటు మరికొన్ని హత్యకేసుల్లో శ్రీను ప్రధాన నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.