మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం


మెదక్‌: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు బైక్‌లపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

 

ఈ సంఘటన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ సమీపంలో శుక్రవారం మద్యాహ్నం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. 

 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top