వృద్ధురాలిపై అత్యాచారం
శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పోతారం గ్రామ శివారులో ఓ వృద్ధురాలు(65) అత్యాచారానికి గురైంది. వృద్ధురాలు జిన్నారం మండలం కానుకుంటలోని బంధువుల ఇంటికి వెళ్లి సోమవారం సాయంత్రం తిరుగు ప్రయాణమైంది. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పోతారం బస్టాండ్ వద్ద దిగింది. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుండగా బైక్పై ఇద్దరు వ్యక్తులు వచ్చారు.
గ్రామంలో దింపుతామని ఆమెను బైక్పై ఎక్కించుకున్నారు. కిలోమీటర్ వెళ్లాక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో ఇబ్బంది పడుతూ ఇంటికి చేరుకున్న వృద్ధురాలు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంటనే ఆమెను తూప్రాన్లోని ప్రైవేటు ఆస్పత్రికి, అటు నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు.