ఇవాంకను వదలని రామ్ గోపాల్ వర్మ
సాకి, హైదరాబాద్ : రోజు ఏదోలా వార్తల్లో ఉండే వ్యక్తి, దర్శకుడు రామ్గోపాల్ వర్మ. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం మీద సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంటూ అటు అభిమానులను, ఇటు నెట్జన్లను అలరిస్తూ ఉంటాడు. మరికొద్ది రోజుల్లో హైదరాబాద్లో జరగనున్న అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు(జీఈఎస్)–2017 ను ఈ రోజుటి అంశంగా ఎంచుకున్నాడు. ఇంక అంతే వరుసపెట్టి స్టేట్మెంట్లు తన ఫేస్బుక్ వాల్పై రాసుకొచ్చాడు.
ఆయన ఏమన్నాడంటే ' అందంగా ఉంటుందని ఇవాంకకు అహంకారం, అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ అందాన్ని చూస్తే ఆమె షాక్ అవ్వడం ఖాయం. ఇవాంక ట్రంప్, కేసీఆర్ పక్కపక్కన ఉంటే ఎవరూ ఇవాంకను చూడరు, ఈ విషయంలో నేను పందెం కాస్తా..' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అంతేకాదు ఇవాంక అంతర్జాతీయంగా అందమైన అమ్మాయి కాబట్టి మూడు స్పెషల్ జ్యూరీ నంది అవార్డులు ఇవ్వాలి అంటూ సటైరికల్గా పోస్టుచేశాడు.