నేడు మోస్తరు వర్షాలు

rain today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒడి శా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర తీరం వెంబడి అల్పపీడ న ద్రోణి కొనసాగుతుండటంతో మంగళవారం రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురి సే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.

బుధవారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గత 24 గంటల్లో నిజామాబాద్‌ జిల్లా శ్రీరామ్‌సాగర్‌ వద్ద 12 సెం.మీ. అతి భారీ వర్షం కురిసింది. నిర్మల్‌ జిల్లా ముదోల్‌లో 9 సెంటీమీటర్లు, నిజామా బాద్‌ జిల్లా నవీపేటలో 8, మహబూబాబాద్, వర్ని, కోటగిరి, కమ్మర్‌పల్లిలలో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. నిజామాబాద్, ఇబ్రహీంపట్నం, మోర్తాడ్, బోథ్, జూలపల్లి, మక్లూర్‌లలో 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top