తెలంగాణ హైకోర్టును తాకిన సీఏఏ ప్రకంపనలు

Protests Against Citizenship Amendment Act At Telangana High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ప్రకంపనలు తెలంగాణ హైకోర్టును తాకాయి. సీఏఏను వ్యతిరేకిస్తూ హైకోర్టు వద్ద బుధవారం కొందరు లాయర్లు ఆందోళనలకు దిగగా.. మరోవైపు సీఏఏను సమర్థిస్తూ మరికొంతమంది న్యాయవాదులు గుమిగూడారు. దీంతో హైకోర్టు వద్ద ఒకింత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు పెద్ద సంఖ్యలో హైకోర్టు వద్ద మోహరించారు. సీఏఏకు వ్యతిరేకంగా, అనూకూలంగా న్యాయవాదులు చీలిపోయి.. నిరసన కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి ఉండటంతో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top