అంత్యక్రియలు అడ్డుకున్న పోలీసులు

police prevented the funeral - Sakshi

వేములవాడ: ఆమె వృద్ధురాలు.. చనిపోయింది.. అంత్యక్రియల కోసం బంధువులు, కుటుంబ సభ్యులు శ్మశానానికి తీసుకెళ్లారు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఏమిటంటే మృతురాలి ఒంటిపై గాయాలున్నాయంటూ అంత్యక్రియలు ఆపించారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో జరిగింది. స్థానిక గాంధీనగర్‌కు చెందిన అన్నరం లక్ష్మి (70) శనివారం ఉదయం మరణించింది.

కడసారి చూపు కోసం బంధువులు రావడంతో దహన సంస్కారాలు చేసేందుకు మూలవాగులోని కడుదంక తీసుకు వెళ్లారు. అయితే ఈమె మృతిపై సమాచారం అందిన పోలీసులు అక్కడికి వెళ్లి శవాన్ని పరిశీలించి మృతదేహంపై గాయాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు. పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top