మున్సిపల్‌ ఎన్నికలపై హై కోర్టులో పిటిషన్‌

Petition Filed In TS High Court Over Municipal Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లను సర్కారు అమలు చేయడం లేదంటూ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస గౌడ్‌ హై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జులై 2 నాటికి 53 మున్సిపాలిటీలకు గడువు ముగియడంతో ఎన్నికలు నిర్వహించాలని శ్రీనివాస గౌడ్‌ తన పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ మంగళవారం హై కోర్టులో విచారణకు రానుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top