ఉరితాడైన తాటిచెట్టు మోకు 

Person Deceased In Peddapalli - Sakshi

సాక్షి, పెద్దపల్లి : తాటి చెట్టు ఎక్కుతున్న ఓ గీత కార్మికుడు పట్టు తప్పడంతో మోకు మెడకు చుట్టుకుని ఉరి పడింది. దీంతో ఊపిరాడక చెట్టుపైనే మృతి చెందాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా, మండలం గుర్రాంపల్లిలో మంగళవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన మామిడి రాజయ్య (48) ఎప్పటిలాగే కల్లు గీసేందుకు సోమవారం సాయంత్రం తొగరి రాజేశంకు చెందిన పొలంలో తాటి చెట్టుపైకి ఎక్కుతుండగా పట్టు తప్పి కిందికి జారాడు. ఈ క్రమంలో రాజయ్య మెడకు మోకు చుట్టుకుంది. ఊపిరాడక చెట్టుపైనే విగతజీవిగా మారాడు. కాగా రాజయ్య ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తాటి వనం వైపు వెళ్లి వెతుకుతుండగా అతని సైకిల్‌ కనిపించింది. ఆ ప్రాంతంలోని తాటి చెట్టుకు వేలాడుతూ కనిపించడంతో కుప్పకూలిపోయారు. మరొకరి సాయంతో మృతదేహాన్ని కిందికి దించి పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top