మన టీవీ సేవలు మరింత విస్తృతం: మంత్రి కేటీఆర్
హైదరాబాద్: మన టీవీ సేవలను మరింతగా విస్తరిస్తామని ఐటీ మంత్రి కె.తారక రామారావు అన్నారు. హైదరాబాద్లోని మన టీవీ కార్యాలయం(బీఆర్ అంబేద్కర్ వర్సిటీ )లో ఆ సంస్థ అధికారులతో శనివారం మంత్రి సమీక్షించారు. సంస్థకు అవసరమైన మౌలిక వసతులపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
మన టీవీకి శాశ్వత సీఈవోను నియమించాలని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శికి సూచించారు. ప్రతి గ్రామంలోనూ త్వరలో ఏర్పాటు చేయనున్న ఈ-పంచాయతీల్లో మన టీవీ ప్రసారాలు లభ్యమయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణితో సమావేశమై మన టీవీ ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై సమాచారం అందించే అవకాశాలపై చర్చించారు.