వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యం: ఎడవల్లి
కొత్తగూడెంరూరల్ (ఖమ్మం): కాంగ్రెస్ ఎన్నికలో ప్రచారంలో భాగంగా టీపీసీసీ సభ్యుడు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ రామవరంలోని 12 వార్డు, గరీబ్పేట, నిమ్మలగూడెం, కోమిటిపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా అయా ప్రాంతాల ప్రజలు మురుగు కాల్వలు, రోడు సదుపాయం లేని గ్రామాలను గుర్తించి, తాగునీటి సమస్యల పరిష్కరించాలని ఎన్ని సార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవటం లేదు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామన్నారు. ఇల్లులేని ప్రతివారికి ఇందిరమ్మ గృహం కల్పిస్తామన్నారు. మూడు వేల రూపాయాలు నిరుద్యోగ బృతి, రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ, మంచినీళ్లు సమస్యను తీరుస్తామన్నారు.
విద్యా, వైద్య వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తామన్నారు రామవరంలోని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, మహిళలు 60 కుటుంబాల వరకు కాంగ్రెస్లో చేరారు. వారిని కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి సాధరణంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మారతమ్మ, శాంతాదేవి, లక్ష్మీ, తహెర, అంజలి, సరోజ, సుశీల, రాధా, కమలాదేవి, హేమలత, సుమ తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఏసుపాదం, వసంతరావు, ఆర్ రాజేష్, సోమేశ్వర్గౌడ్, జక్కుల సత్యనారాయణ, కాపా శ్రీను, నగేష్, గణేష్ నాయక్, మాలోత్ కోటేష్, వీరబాబు, వినోద్ కుమార్, భూపతి అశోక్, కొప్పుల రమేష్, నాగేందర్ పాల్గొన్నారు.