ఈతకు వెళ్లి ఒకరి మృతి
హైదరాబాద్: ఈతకు వెళ్లి ఒకరు మృతిచెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం అబ్దుల్లాపూర్ మెట్ చెరువులో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. అయితే, విషయం తెలుసుకున్న స్థానికులు నలుగురిని కాపాడగా, ఒకరు మృతిచెందినట్లు పోలీసులు వివరించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
సంబంధిత వార్తలు