భార్యాభర్తలపై హత్యాయత్నం

murder attempt on husband and wife - Sakshi

వాజేడు: భూతగాదాలో భార్యాభార్తలపై హత్యాయత్నం జరిగింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వాజేడు మండలం ఎడ్జర్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అంకెనబోయిన మల్లయ్య ఎకరం చేనులో మినుములు పోస్తున్నాడు. ఈ సమయంలో తాండ్ర సూర్యం, తాండ్ర సావిత్రి అనే భార్యాభర్తలు అక్కడికి వచ్చి తమ చేనులో పంట వేయొద్దని వారించారు. ఈ చేను నాది.. నేనే చేసుకుంటాను.. గతంలో నాకు అమ్మారంటూ మల్లయ్య వారితో వాదనకు దిగాడు. చేను మీది కాదు..మాకు రూ.60 వేలు అప్పుగా ఇచ్చి దాని కింద పంట సాగు చేసుకుంటున్నారు.. ఇపుడు ఆ డబ్బులు ఇస్తామని ఆ దంపతులు చెప్పారు. దాంతో ఆగ్రహం చెందిన మల్లయ్య అందుబాటులో ఉన్న పిక్కా(తోటలో గడ్డిని కోసే కొడవలి)తో వారిపై దాడిచేయగా దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వీరిని ఆస్పత్రికి తరలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top