'త్వరలోనే ఇంటింటికి మంచినీరు'

mp kavitha visits nizamabad district - Sakshi

సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆర్గుల్ గ్రామంలో నిర్మితమవుతున్న మిషన్ భగీరథ పంప్ హౌజ్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, ఫిల్టర్ బెడ్ పనులను ఎంపీ కల్వకుంట్ల కవిత శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆర్గుల్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రజలకు త్వరలోనే ఇంటింటికి సురక్షిత తాగునీరు సరఫరా చేస్తామని చెప్పారు.

మిషన్ భగీరథ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశయం మేరకు అనుకున్న సమయంలోపే ఈ పనులు పూర్తవుతాయన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న విధంగానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని కవిత స్పష్టం చేశారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top