ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన ఓ ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మావల మండలం సావర్గామ్కు చెందని ముఖేష్చ, కళ్యాణిలు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో వారు పెళ్లికి నిరాకరించారు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమికులు మంగళవారం అర్థరాత్రి రైలు కింద పడి బలవన్మరణం చెందారు.
ఇరు కుటుంబాలను పెళ్లికి ఒప్పించలేకే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ముఖేష్ కారు డ్రైవర్గా పనిచేస్తుండగా.. కల్యాణి డిగ్రీ చదువుతోంది. స్థానికుల సమాచారంతో మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.