లెవెల్‌ బ్రిడ్జి పేల్చేసిన మావోయిస్టులు

Level bridge blasted by Maoists - Sakshi

పర్ణశాల: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లా ధర్మపేట శివారులో లోలెవల్‌ బ్రిడ్జిని బుధవారం రాత్రి మావోయిస్టులు పేల్చివేశారు. భద్రాద్రి కొత్తగూడెం దుమ్ముగూడెం మండల సరిహద్దులో ఈ ఘటన జరిగింది. అత్యాధునిక మోర్తర్‌ 51ఎంఎం ఐఎల్‌ఎల్‌జీ బాంబును అటవీ ప్రాంతంలో 100 మీటర్ల వైరు వేసి బ్రిడ్జి పేల్చినట్లు తెలుస్తోంది.

బాంబు పేలిన తాకిడికి రెండు అడుగుల మందం ఉన్న బ్రిడ్జి రెండు ముక్కలుగా విడిపోయింది. ఈ ఘటనలో సుమారు 100 మంది సాయుధ మావోలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీంతో రోడ్డు నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top