తెలంగాణ కోహ్లి కేటీఆర్
మాజీ క్రికెటర్ శ్రీకాంత్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఇండియన్ క్రికెట్ టీమ్లో విరాట్ కోహ్లి ఎలాగో తెలంగాణకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అలా అంటూ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. నిట్ ఆడిటోరియంలో శనివారం జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్తో పాటు మాజీ క్రికెటర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. కేటీఆర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 1987లో హైదరాబాద్లో జరిగిన పాక్– ఇండియా క్రికెట్ మ్యాచ్లో శ్రీకాంత్ ఓపెనర్గా బ్యాటింగ్ చేస్తుంటే... పాక్ బౌలర్ వసీం అక్రమ్ వేసిన బంతి ఆయన కంటికి తగిలి రక్తస్రావం అయిందన్నారు.
డ్రెస్సింగ్ రూమ్లో గాయానికి నాలుగు కుట్లు వేయించుకుని తిరిగి క్రీజ్లోకి శ్రీకాంత్ వచ్చి బాగా ఆడారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. సమస్యలను ఎదుర్కొనే మానసిక స్థైర్యం విద్యార్థులకు, యువతకు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ విషయం చెబుతున్నానన్నారు. క్రికెటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణ దూసుకుపోతూ నంబర్ వన్గా ఉందన్నారు. ఇండియన్ క్రికెట్ టీమ్లో విరాట్ కోహ్లి ఎలాగో.. తెలంగాణకు కేటీఆర్ అలాగే అని పోల్చారు. కోచ్ రవిశాస్త్రిలాగే కడియం ఉన్నారన్నారు. తక్కిన వారు ఇత ర క్రికెటర్ల తరహాలో పని చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నారన్నారు.