మరిన్ని మెగా పరిశ్రమలొస్తాయి!

ktr about industries - Sakshi

మంత్రుల కమిటీ  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పారిశ్రామిక విధానం వల్ల ఇప్పటికే పలు మెగా పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని, మరిన్ని ప్రాజెక్టులు కూడా రానున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.

పెట్టుబడులతో ముందుకొచ్చిన మెగా ప్రాజెక్టులకు ప్రత్యేక రాయితీ, ప్రోత్సాహకాలపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో మంత్రుల కమిటీ గురువారం ఇక్కడ సమావేశమైంది. ఈటలతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేందుకు పరిశ్రమలకు రాయితీ, ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. వివిధ రాష్ట్రాల్లో పరిశ్రమలకు అందిస్తున్న రాయితీ, ప్రోత్సాహకాలపై చర్చించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top