స్థానికులకే యాదాద్రి ఆలయ ఉద్యోగాలివ్వాలి: కోదండరాం

 Kodandaram says Yadadri temple jobs should give local people - Sakshi - Sakshi

సాక్షి, యాదాద్రి: ‘కొలువులకై కొట్లాట’ సభను ఈ నెల 30న హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించనున్నట్లు టీజేఏసీ చైర్మన్‌ ప్రోఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. యాదగిరిగుట్టలో సోమవారం జరిగిన కొలువులకై కొట్లాట సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. యాదాద్రి దేవస్థానంలో కల్పించే ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని, ప్రణాళికాబద్ధంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగాల్లో స్థానికులకు పెద్దపీట వేయాలని, ప్రభుత్వ నిధులను సక్రమ పద్ధతిలో ఖర్చు చేయాలని కోదండరాం సూచించారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top