అసెంబ్లీపై కాషాయ జెండా ఎగరేస్తాం 

Kishan Reddy Confident ON BJP Will Form Government in Telangana - Sakshi

బీజేఎల్పీ మాజీ నేత కిషన్‌రెడ్డి 

దుబ్బాకటౌన్‌: తెలంగాణలో బీజేపీ జెండా ఎగరబోతుందని.. మెజారిటీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని బీజేపీ శాసనసభాపక్ష మాజీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని బాలాజీ గార్డెన్‌లో దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా యువ సమ్మేళనం సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతి, దుర్మార్గ, కుటుంబపాలన పట్ల తెలంగాణ ప్రజలు విసుగు చెందారన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పి బీజేపీని అధికారంలోకి తేవడం తథ్యమన్నారు. ఈ నాలుగున్నరేండ్ల పాలనలో సీఎం కేసీఆర్‌ కేవలం 17 సార్లు మాత్రమే సచివాలయంలో అడుగుపెట్టారని కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ శాసనసభపై కాషాయ జెండా ఎగురుతుందని తనతో పాటు రఘునందన్‌రావు ప్రభుత్వంలో కీలకమంత్రి పదవిలో ఉంటార న్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మో ర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top