బంజారాహిల్స్లో స్వల్ప భూకంపం
హైదరాబాద్: బంజారాహిల్స్లో కేబీఆర్ పార్క్ వద్ద బుధవారం ఉదయం 8.30 ప్రాంతంలో స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్పై 0.6 తీవ్రత నమోదైనట్లు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు ధృవీకరించారు. కేబీఆర్ పార్కు వద్ద ఆ సమ యంలో సుమారు మూడు వేల మంది వాకింగ్ చేస్తుండగా వందల సంఖ్యలో వాహనాలు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. క్షణం పాటు భూమి నుంచి జర్క్లాగా వచ్చినట్లు గమనించామని అయితే అది భూకంపం అనుకోలేదని పలువురు తెలిపారు.
ఇంటికి వెళ్లాక గానీ ఇక్కడ భూకంపం వచ్చినట్లు తెలియరాలేదన్నారు. ఇటీవలే బోరబండలో పలుమార్లు భూమి కంపించడంతో ఇక్కడ కూడా అలాంటివి చోటు చేసుకుంటాయేమో అని స్థానికులు భయకంపితులు అవుతున్నారు. ఆందోళన చెందాల్సిందేమీ లేదని నిపుణులు పేర్కొంటున్నారు.