పొగడ్తలకు పొంగను, అవమానాలకు కుంగను: దత్తాత్రేయ
హైదరాబాద్: అవమానాలను, సన్మానాలను సమానంగా తీసుకుంటానని, పొగడ్తలకు పొంగను, అవమానాలకు కుంగనని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ సర్కార్ అనవసరంగా కేంద్రాన్ని నిందించకూడదని, కేంద్రం రైతులకు అన్ని రకాలుగా సాయం చేస్తోందని, కొన్ని విషయాల్లో తెలంగాణ సర్కార్ కలిసి రావటం లేదని, పప్పు దినుసుల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వ సబ్సిడీపై విత్తనాలు అందిస్తుందని ఈ అవకాశాన్ని తెలంగాణ రైతాంగం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆదాయం పెరగాలంటే, ఉత్పత్తి ఖర్చు తగ్గాలని అన్నారు. రైతులకు నాలుగో విడత రుణమాఫీ చేయాలని, రైతులకు న్యాయం జరిగేలా సీఎం చొరవ తీసుకోవాలని, కేంద్రం రైతులకు బోనస్ ఇస్తోంది. ఫసల్ బీమా యోజన విషయంలో కేంద్రం ముందుందని కానీ రాష్ట్ర ప్రభుత్వం వెనక పడిందని దత్తాత్రేయ అన్నారు.
సంబంధిత వార్తలు