‘అమ్మాయితో’ మణిగౌడ్
కౌడిపల్లి(నర్సాపూర్): మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కానుకుంట మణిగౌడ్ ప్రస్తుతం ‘అమ్మాయితో’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇతడితోపాటు కరీంనగర్ జిల్లాకు చెందిన సురేష్, వినయ్, అజయ్లు ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. మణిగౌడ్ గతంలో గుంటూర్ టాకీస్ బ్యానర్పై వచ్చిన రాజా మీరు కేక సినిమాలో ఒక నిమిషం రోల్లో నటించాడు. కాగా ప్రస్తుతం అమ్మాయితో సినిమాలో అవకాశం రావడంతో హీరోగా చేస్తున్నాడు. సినిమాల్లో అవకాశం కోసం ఐదారేళ్లుగా ప్రయత్నిస్తున్నట్లు మణిగౌడ్ తెలిపారు. తండ్రి సత్యాగౌడ్ గ్రామంలో వీధి నాటకాలు వేసేవాడు. బాబాయ్ ఈవెంట్ మేనేజర్ కావడంతో ఓ ఫంక్షన్లో డైరెక్టర్ పరిచయం అయ్యాడు. పరిచయం పెరగడంతో హీరోగా అవకాశం రావడంతో పట్టుదలతో కృషిచేస్తున్నాడు. ప్రస్తుతం షాపూర్నగర్ ప్రాంతంలో ఉంటున్న మణిగౌడ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.