‘టీఆర్‌ఎస్ జనం బాట.. కూటమి ఢిల్లీ బాట’

Harish rao attends Yadavs Athmiya sammelanam in Siddipet - Sakshi

సాక్షి, సిద్దిపేట : కేసీఆర్, సిద్దిపేట ప్రజల ఆశీస్సులతో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల ఆత్మీయతను సాధించుకున్నానని ఆపద్ధర్మ మంత్రి హరీష్‌ రావు అన్నారు. తడూరి బాలాగౌడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో హరీష్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడికి వెళ్లినా సిద్దిపేట అంటే హరీష్ రావు నియోజవర్గం అనే మంచి పేరు సాధించుకున్నానని తెలిపారు.

రాజకీయ నాయకునిగా కాకుండా ప్రజల్లో ఒకడిగా ఉంటున్నానని హరీష్‌ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులకు నియోజకవర్గంలో ఎన్ని ఊర్లు, ఎంత మంది ప్రజలు ఉన్నారో కూడా తెలియకుండానే ఓట్ల కోసం వస్తున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ జనం బాట అయితే కూటమి ఢిల్లీ బాట అన్నారు. కష్టపడి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, మన దగ్గరే ఉండాలన్నారు. నెల రోజులు కేసీఆర్, కారు గుర్తును గుర్తుంచుకోవాలని, 5 ఏళ్ళు ప్రజల వెంటే ఉంటానని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top