మార్చి15 నుంచి ఒంటిపూట బడులు
సాక్షి, హైదరాబాద్ : ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను త్వరలోనే డీఈవోలకు జారీ చేయనుంది. అలాగే ఉన్నత పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లు అందజేయాలని విద్యా శాఖ యోచిస్తోంది. దూరాభారంతో పాఠశాలలకు దూరమవుతున్న విద్యార్థినులకోసం ఈ పథకం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. దీనికోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.