ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి..

Greatly Marepalli Surender Reddy  Birthday Celebrations - Sakshi

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌ : ప్రజలకు సేవలు చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని కాంగ్రెస్‌ నియోజకవర్గ నాయకుడు మారేపల్లి సురేందర్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో మంగళవారం సురేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి మెట్టుగడ్డలోని అంధుల పాఠశాల, ఏనుగొండలోని రెడ్‌క్రాస్‌ అనాథశరణాలయంలో చిన్నారుల మధ్య కేక్‌ కట్‌ చేసి వారికి పండ్లు పంపిణీ చేశారు.

అలాగే, జేజేఆర్‌ గార్డెన్స్‌ ఫంక్షన్‌హాల్‌లో ఆయన అభిమానుల మధ్య పుట్టిన రోజు కేక్‌కట్‌ చేశారు. ఈ సందర్భంగా రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలను ప్రారంభించారు. ఇంకా జిల్లా కేంద్రానికి ఆటోడ్రైవర్‌ కుమార్తె నందినికి నీట్‌లో ర్యాంకు సాధించడంతో ఎంబీబీఎస్‌ చదువు నిమిత్తం రూ.60వేలు, మరో ఇద్దరికి 16వేల, 25వేల ఆర్థిక సాయం అందజేశారు.

అనంతరం సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందించడంలో చెప్పలేని ఆనందం ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో కూడా తాను పదవిలో ఉన్నా, లేకున్నా నిస్వార్థంగా ప్రజలకు సేవలు చేస్తానని తెలిపారు. అభిమానులకు, ప్రజ లకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు.  

సురేందర్‌రెడ్డికి పలువురి శుభాకాంక్షలు

కాంగ్రెస్‌ నేత ఎం.సురేందర్‌రెడ్డికి పలువురు రాజకీయ పార్టీల నేతలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏఐసీసీ కార్యదర్శి, వనపర్తి ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, న్యాయవాది జి.మధుసూదన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు ఎన్‌పీ.వెంకటేశ్, కట్టా రవికిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌గౌడ్, చంద్రకుమార్‌గౌడ్, సీజే బెనహర్, అనంతరెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top