అమ్మకానికి శిశువు..!


తాండూరు: మనవడిని అమ్మేందుకు అమ్మమ్మ ప్రయత్నించిన వైనమిది. ఈ ప్రయత్నాన్ని స్థానిక అంగన్‌వాడీ టీచర్లు,గ్రామస్తులు అడ్డుకున్నారు. మండల పరిధిలోని అంతారంలో ఈ  సంఘటన జరిగింది. అర్బన్ ఎస్‌ఐ అభినవ చతుర్వేది తెలిపిన వివరాలు.. యాలాల మండలం కిష్టపూర్‌కు చెందిన సమ్మప్ప, సాయమ్మలు దంపతులు. దినసరి కూలీలైన వీరు కొంతకాలం క్రితం తవు కువూర్తె సంతోషకు వివాహం చేశారు.



అరుుతే సంతోష, ఆమె భర్త ప్రస్తుతం విడిపోయూరు. వీరికి ఆరునెలల బాబు ఉన్నాడు. ఇటీవల సంతోషకూడా ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోవడంతో సాయమ్మనే శిశువును పోషిస్తోంది. అరుుతే వుంగళవారం ఆమె వుండలంలోని అంతారం గ్రామానికి తోటి కోడలు మణెమ్మతో కలిసి వచ్చింది. అంతారంలోని పలు చోట్ల మనవడిని ఎత్తుకొని తిరిగిన ఆమె చివరకు స్థానిక అంగన్‌వాడీ కేంద్రం వద్దకు వచ్చింది. తవుకు బాబును పోషించే స్థోవుత లేదని, ఎవరైనా తీసుకుంటే అవుు్మతావుంటూ అక్కడ ఉన్న అంగన్‌వాడీ సిబ్బందికి చెప్పింది. వారు ఈ విషయూన్ని కిష్టాపూర గ్రావుస్తులకు తెలిపారు.



దీంతో కిష్టాపూర్‌వాసులు అక్కడికి చేరుకొని సాయువ్ముపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సవూచారం అందుకున్న పోలీసులు శిశువును, సాయువ్మును తాండూరు అర్బన్ పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చారు. అరుుతే తాను శిశువును అవ్ముడానికి తీసుకురాలేదని, తన కూతురును వెతకడానికే అంతారం వచ్చినట్లు సాయువ్ము చెబుతోంది. సవ్ముప్పను కూడా స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. తాండూరు సీడీపీఓ వెంకటలక్ష్మి సూచన మేరకు శిశువును పట్టణంలోని శిశుగృహకు తరలించనున్నట్లు ఎస్‌ఐ అభినవ చతుర్వేది తెలిపారు. ఈ విషయుమై లిఖితపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు అందన్నట్లు ఎస్‌ఐ చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top