వచ్చేది ప్రజాకూటమి ప్రభుత్వమే

Grand alliance Will Win In The Next Elections Said Soyam Bapurao - Sakshi

తలమడుగు(బోథ్‌): వచ్చేది ప్రజాకూటమి ప్రభుత్వమేనని కాంగ్రెస్‌ బోథ్‌ అభ్యర్థి సోయం బాపూరావు అన్నారు. గురువారం మండలంలోని పల్లి(బీ) గ్రామస్తులు సోయం బాపూరావు సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు మండలంలో ఎక్కడ కట్టారో చూపించాలని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడే చేయని ముఖ్యమంత్రి మళ్లీ అధికారంలోకి వస్తే చేస్తాడని ప్రజలకు నమ్మకం లేదని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని ఆదరిస్తున్నారని, మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు పెద్దఎత్తున స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజివ్‌రెడ్డి, గోక గణేష్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ప్రకాష్‌రావు,మహేందర్‌రెడ్డి, విఠల్, తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top