ఢిల్లీకి బయలు దేరిన గవర్నర్
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. ఓటుకు నోటుకు వ్యవహారం మరింత ముదిరి ఇరు రాష్ట్రాల మధ్య పెను వివాదానికి దారి తీస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మొత్తం వ్యవహారంపై గవర్నర్ నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం హోంమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతితో భేటీ అవ్వనున్నారు. అంతేకాకుండా మంగళవారం భేటీ అయిన ఏపీ కేబినెట్ సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో అధికారాలు గవర్నర్కు అప్పగించాలని కూడా తీర్మానం చేసిన నేపథ్యంలో ఢిల్లీలో జరిగే పరిణమాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ అధికారాలకోసమే పట్టుబట్టాలని ఏపీ కేబినెట్ బలంగా కోరుతున్న నేపథ్యంలో ఆమేరకు ముందడుగు పడనుందా అనే విషయంపై ఎదురుచూడాల్సిందే.