ప్లీజ్.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి..!
సాక్షి, నవాబుపేట: మార్పు కోసం బీజేపీ ప్రభుత్వం రావాలి అందుకే ఒక్క అవకాశం ఇవ్వాలని బీజేపీ జడ్చర్ల అభ్యర్థి మధుసూదన్యాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని దొడ్డిపల్లి, కూచూర్, ఇప్పటూర్, నవాబుపేట, పోమాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు.
కేంద్రంలో మోదీ ఇచ్చిన నిధులతో ఇక్కడ అబివృద్ధి కార్యక్రమాలు చేసిన టీఆర్ఎస్, అన్ని తామే చేసినట్లు గొప్పలు చెప్పుకోవటం సరికాదని అన్నారు. బీజేపీ హయంలో దే«శం అభివృద్ధిలో పరుగులు తీస్తుందని అందుకే రాష్ట్రంలోనూ బీజేపీకి అవకాశం ఇస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.
బీజేపీలో చేరిక..
మండలంలోని దొడ్డిపల్లికి చెందిన 50 యువకులు శుక్రవారం బీజేపీ అభ్యర్థి మధుసూదన్యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. కార్యక్రమాలో అసెంబ్లీ ఇన్చార్జ్ రాపోతుల శ్రీనువాస్, బాలస్వామి, నర్సింహ, యాదయ్య, సత్యం, శ్రీనువాస్, శివ, రమేష్,అంజనేయులు వెంకటయ్య, రఘు పాలొన్నారు.